Sangam Barrageను జాతికి అంకితం చేసిన సీఎం జగన్
ABN, First Publish Date - 2022-09-06T19:24:51+05:30
మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజ్ను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జాతికి అంకితం చేశారు.
నెల్లూరు: మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజ్ (Sangam barrage)ను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan mohan reddy) జాతికి అంకితం చేశారు. మంగళవారం సంగం బ్యారేజ్ వద్దకు చేరుకున్న సీఎంకు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి (Mekapati rajamohan reddy), ఎమ్మెల్యే విక్రం రెడ్డి (Vikram reddy) ఘన స్వాగతం పలికారు. అక్కడి ఫోటో ఎక్జిబిషన్ను సందర్శించిన ముఖ్యమంత్రి(AP CM) పైలాన్ను ఆవిష్కరించారు. అనంతరం బ్యారేజ్ను జాతికి అంకితం చేశారు. ఆపై కావలి కెనాల్, కనిగిరి రిజర్వాయర్ల రేగులాటర్లకు స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YSR), దివంగత మంత్రి గౌతం రెడ్డి (Gowtam reddy) విగ్రహాలను సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు.
Updated Date - 2022-09-06T19:24:51+05:30 IST