ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

11 నుంచి మున్సిపల్‌ కార్మికుల సమ్మె

ABN, First Publish Date - 2022-07-06T03:20:05+05:30

ఈనెల 11న జరగబోయే మున్సిపల్‌ కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు.

సమావేశంలో సీఐటీయూ, ఏఐటీయూసీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలిటౌన్‌, జూలై 5: ఈనెల 11న జరగబోయే మున్సిపల్‌ కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో జీ కిషోర్‌ అధ్యక్షతన సీఐటీయూ, ఏఐటీయూసీ కార్మిక సంఘాల సమావేశం జరిగింది. సీఐటీయూ గౌరవాధ్యక్షుడు పె పెంచలయ్య, ఏఐటీయూసీ జిల్లా నాయకుడు మల్లి అంకయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన పర్మినెంట్‌ హామీ విస్మరించారన్నారు. ఆప్కాస్‌ విధానం తీసుకొచ్చి కార్మికుల పనిభారం పెంచారని ఈఎ్‌సఐ కార్మికులకు ఉపయోగపడడంలేదని పీఎఫ్‌ కార్మికులకు సక్రమంగా అందడంలేదన్నారు. కార్మిక సంఘాలు సమస్యలు పరిష్కరించమని అనేకసార్లు మొరపెట్టుకున్నప్పటికీ పాలకులు పెడచెవిన పెట్టారని, సమస్యల పరిష్కారం కోసం ఈనెల 11 నుంచి  కార్మికులు నిరవధిక సమ్మెకు దిగనున్నారన్నారు. సమావేశంలో వర్కర్స్‌ యూనియన్‌ నేతలు ఆనందరావు, టీ మాలకొండయ్య, వై రవి, పోలయ్య, ఏఐటీయుసీ నేతలు వై ప్రభావతి, రాజేష్‌, కార్మికులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-06T03:20:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising