చెన్నూరు ఆర్బీకేకి ఐఎ్సవో గుర్తింపు హర్షణీయం
ABN, First Publish Date - 2022-01-20T01:49:44+05:30
మండలంలోని చెన్నూరు రైతుభరోసా కేంద్రాన్ని వ్యవసాయశాఖ జేడీ ఆనందకుమారి బుధవారం సందర్శించారు.
సర్టిఫికెట్ అందజేసిన జేడీ ఆనందకుమారి
దగదర్తి, జనవరి 19: మండలంలోని చెన్నూరు రైతుభరోసా కేంద్రాన్ని వ్యవసాయశాఖ జేడీ ఆనందకుమారి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఐఎ్సవో సర్టిఫికెట్ కాపీలను సిబ్బందికి అందచేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో 680 ఆర్బీకేలలో చెన్నూరు ఆర్బీకేకి ఐఎ్సవో గుర్తింపు రావటం హర్షణీయమన్నారు. గుర్తింపు రావటానికి కృషి చేసిన సిబ్బందిని ఆమె అభినందించారు. అంతకు మునుపు ఆమె ఉలవపాళ్లలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ ప్రసాద్రావు, రైతుశిక్షణ కేంద్రం డీడీ శివనారాయణ, కావలి ఏడీఏ కన్నయ్య, వీఏఏ శ్రావణి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-01-20T01:49:44+05:30 IST