చంద్రబాబుతోనే అభివృద్ధి : కురుగొండ్ల
ABN, First Publish Date - 2022-03-16T03:58:06+05:30
రాష్ట్రాభివృద్ధి ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమని వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. పట్టణ పరిధిలోని 24వా
వెంకటగిరి, మార్చి 15: రాష్ట్రాభివృద్ధి ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమని వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. పట్టణ పరిధిలోని 24వార్డులో మంగళవారం ఏర్పాటుచేసిన గౌరవ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వైఎస్ రాజారెడ్డి రాజ్యంగం నడుస్తుందన్నారు. సామాన్యుడి బతుకు గగనంగా మారిందన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించా లన్నారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు సమస్యల ను ఏకరువు పెట్టారు. సభలో టీడీపీ నాయకులు కేవీకే ప్రసాద్నాయుడు, పీ. రాజేశ్వరరావు, బీరం రాజేశ్వరరావు, సత్యనారాయణ, మురళీ, లక్ష్మీపతి, బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-03-16T03:58:06+05:30 IST