ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్మాణరంగం కుదేలు!

ABN, First Publish Date - 2022-01-08T03:29:32+05:30

గత రెండేళ్లుగా కొవిడ్‌-19తో అన్ని రంగాలతో పాటు భవన నిర్మాణం కూడా కుదేలైంది. భవన నిర్మాణ రంగ కార్మికులు ఉపాధిలేక అల్లాడిపోయారు.

అమ్మకాలు లేక గిడ్డంగిలో నిల్వ ఉన్న సిమెంటు బస్తాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరిగిన సిమెంటు ధరలు

పేదలకు మోయలేని భారం

గత వారంలో 20 నుంచి రూ.30 పెంపు

తాజాగా మరో రూ.30 పెరుగుదల

ఉదయగిరి, జనవరి 7: గత రెండేళ్లుగా కొవిడ్‌-19తో అన్ని రంగాలతో పాటు భవన నిర్మాణం కూడా కుదేలైంది. భవన నిర్మాణ రంగ కార్మికులు ఉపాధిలేక అల్లాడిపోయారు. ఇటీవల ఒమైక్రాన్‌ విజృంభిస్తుందన్న ప్రచారం ఉన్నప్పటికీ అన్ని రంగాలు కూడదీసుకుని నెమ్మదిగా నడక ప్రారంభించాయి. పేద, మధ్య తరగతి ప్రజలు కొందరైనా ఇళ్లు కట్టుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో సిమెంటు, ఇటుక, ఇసుక ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ ఏడాది ఒకటో తేదీ నుంచే బస్తాకు రూ.20 నుంచి రూ.30 వరకు కంపెనీలు పెంచేశాయి. దీంతో బస్తా సిమెంటు ధర రూ.320 నుంచి రూ.350 పలుకుతోంది. దానికి తోడు మరో మారు సిమెంటు ధర బస్తాకు రూ.30 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ధరలు రెండు, మూడు రోజుల్లో అమలులోకి రావచ్చు. లేదా పండుగ తర్వాత అమలులోకి రావచ్చు. దీంతో కనీసం ధర రూ.350. గరిష్ట ధర రూ.380 ఉండవచ్చు. ఇక ఐరన్‌ ధర టన్ను రూ.57 వేలు ఉంది. ఇసుక ధర టన్ను రూ.720 వరకూ ఉంది. ఇవ్వన్నీ నిర్మాణ రంగంపై విపరీతమన ప్రభావాన్ని చూపుతుండడంతో నిర్మాణ రంగం కుదేలైంది.  




Updated Date - 2022-01-08T03:29:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising