ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కారు ఢీకొని వృద్ధుడి దుర్మరణం

ABN, First Publish Date - 2022-09-30T03:40:58+05:30

ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతున్న గోసు వెంకట కృష్ణమోహన్‌ (62)ను బోలెరో వాహనం ఢీ కొనడంతో దుర్మరణం చెందాడు

వెంకట కృష్ణమోహన్‌ మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 గుడ్లూరు, సెప్టెంబరు 29 : ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతున్న గోసు వెంకట కృష్ణమోహన్‌ (62)ను   బోలెరో వాహనం ఢీ కొనడంతో దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండలంలోని చేవూరు సమీపాన ఉన్న జాతీయరహదారిపై గురువారం జరిగింది.  పోలీసుల కథనం మేరకు కావలికి చెందిన వెంకట కృష్ణమోహన్‌ చేవూరులో బంధువుల ఇంట జరిగే కార్యక్రమానికి  ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. జాతీయరహదారిపై నుంచి చేవూరు రోడ్డు వైపునకు మలుపు తిరుగుతున్న సమయంలో చెన్నై నుంచి విజయవాడకు వెళుతున్న బోలెరో వాహనం ఢీకొంది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడగా,  కావలికి తరలించారు. పరిస్థితి విషమించడంతో  నెల్లూరుకి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రసాద్‌రెడ్డి తెలిపారు.  మృతుడు రిటైర్డ్‌ బ్యాంక్‌ ఉద్యోగి అని తెలిసింది.

--------


Updated Date - 2022-09-30T03:40:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising