ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్తూరు నియోజకవర్గ టీడీపీ పరిశీలకులుగా బొమ్మి

ABN, First Publish Date - 2022-09-30T04:47:58+05:30

చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ పరిశీలకులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మి సురేంద్రను అధిష్ఠానం నియమించింది.

బొమ్మిని సత్కరిస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తోటపల్లిగూడూరు, సెప్టెంబరు 29 : చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ పరిశీలకులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మి సురేంద్రను అధిష్ఠానం నియమించింది. తోటపల్లిగూడూరు టీడీపీ నాయకులు బొమ్మిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే గంగాధర్‌ నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గానికి పరిశీలకులుగా పనిచేస్తున్నానని తెలిపారు. ఇప్పుడు అదనంగా చిత్తూరు టీడీపీ పరిశీలకులుగా నియమించినందుకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, పొలిట్‌ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.  కార్యక్రమంలో తిరుపతి  పార్లమెంటు నియోజకవర్గం కార్యదర్శి కొణతం రఘుబాబు, సర్వేపల్లి నియోజకవర్గం బీసీ సెల్‌ కార్యదర్శి మన్నెం జితేంద్ర, తోటపల్లిగూడూరు మండల ప్రధాన కార్యదర్శి ముత్యాలు శ్రీనివాసులు, యువత ప్రధాన కార్యదర్శి సుధీర్‌బాబు, ఇసుకపాలెం సర్పంచ్‌ ఇంగిలాల చైతన్యకుమార్‌, గోపిరెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-30T04:47:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising