ఏపీలో హిందువులపై దాడులు పెరిగిపోయాయి: Somu veerraju
ABN, First Publish Date - 2022-05-26T17:44:36+05:30
రాష్ట్రంలో హిందువులపై దాడులు పెరిగిపోయాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు.
నెల్లూరు: రాష్ట్రంలో హిందువులపై దాడులు పెరిగిపోయాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. గురువారం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తిరుమలలో స్వామి వారికి నిత్యం జరిగే కార్యక్రమాలను నిలిపేశారన్నారు. హిందూ మనోభావాలను కించపరుస్తున్నారని మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామి భక్తుల హృదయం గాయపడుతోందన్నారు. యువతకు ఉద్యోగాలు ఇస్తామని జగన్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే... పోలీసుతో పాటు ఏ ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని అన్నారు. మాటలతో ప్రభుత్వం మభ్య పెడుతోందని సోమువీర్రాజు విమర్శించారు.
Updated Date - 2022-05-26T17:44:36+05:30 IST