ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూబాగోతాలు సీబీఐకి అప్పగించాలి : బీజేపీ

ABN, First Publish Date - 2022-09-27T03:21:14+05:30

రాపూరు మండలంలో భూ భాగోతాలు సీబీఐకి అప్పగిస్తేనే నిజాలు వెలుగుచూస్తాయని వెంకటగిరి నియోజవకర్గ బీజేపీ ఇన్‌చా

రెవెన్యూ కార్యాలయం ఎదుట ఽధర్నా చేస్తున్న బీజేపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాపూరు, సెప్టెంబరు 26: రాపూరు మండలంలో భూ భాగోతాలు సీబీఐకి అప్పగిస్తేనే నిజాలు  వెలుగుచూస్తాయని వెంకటగిరి నియోజవకర్గ బీజేపీ ఇన్‌చార్జి ఎస్‌ఎస్‌ఆర్‌ నాయుడు అన్నారు. రాపూరు రెవెన్యూ కార్యాలయం ఎదుట కార్యకర్తలతో కలిసి సోమవారం ఆయన ధర్నా చేపట్టారు. అనంతరం తహసీల్దారు పద్మావతికి  వినతిపత్రం అందించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని పంగిలి, రావిగుంటపల్లి, పులిగిలపాడు గ్రామాల్లో రెవెన్యూ రికార్డులు లేకపోవడంతో ఆందోళన కలిగిస్తుందన్నారు. మండలంలోని అన్నీ గ్రామాలకు రికార్డులు ఉండి, ఆ మూడు గ్రామాలతోపాటు మరో రెండు గ్రామాలకు రికార్డులు లేవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు, భూస్వాములు, అధికారులు కుమ్ముక్కై ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని, రికార్డులు లేకుండా చేశారన్నారు.  పేదలకు భూములను పంపిణీ చేసేవరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు పెంచలయ్య, గోపాల్‌, ప్రతాప్‌, బాబులు, సుబ్రహ్మణ్యం, జయసింహ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-27T03:21:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising