ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంగారం ఇస్తామని మోసగించినట్లు ఫిర్యాదు

ABN, First Publish Date - 2022-08-18T03:50:28+05:30

తక్కువ ధరకు పాత బంగారం ఇస్తామని రూ.45 లక్షలు తీసుకుని మోసగించారని విశాఖపట్నంకు చెందిన కొత్తపల్లి సృజన బుధ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలి రూరల్‌, ఆగస్టు17: తక్కువ ధరకు పాత బంగారం ఇస్తామని రూ.45 లక్షలు తీసుకుని మోసగించారని విశాఖపట్నంకు చెందిన కొత్తపల్లి సృజన బుధవారం కావలి రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం మేరకు, కావలి తుఫాన్‌నగర్‌కి చెందిన దేవరకొండ సుధీర్‌ అలియాస్‌ అజయ్‌రెడ్డి, అదే ప్రాంతానికి చెందిన అతడి స్నేహితుడు మనోహర్‌రెడ్డిలు కలసి తక్కువ ధరకు పాత బంగారం ఇస్తున్నట్లు  పెద్దాపురానికి కత్తుల రాము, కాకినాడకు చెందిన జోగినాఽథం, విజయవాడకు చెందిన రియాజ్‌ల ద్వారా తెలుసుకున్నాడు. దీంతో రాము ఈ విషయాన్ని తన బంధువైన సృజనకు తెలియజేశాడు. దీంతో తక్కువ ధరకు బంగారం వస్తుందని సృజన ఆశ పడింది. దీంతో  పైవారందరూ కలసి గత జూలైలో సృజన వద్ద నుంచి రూ.45 లక్షలు తీసుకున్నారు. అప్పుటి నుంచి  బంగారం రేపు  ఇస్తాం.. మాపు ఇస్తామని చెబుతూ  కాలయాపన చేస్తూ వచ్చారు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు బుధవారం  పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నారు.

-----------------

Updated Date - 2022-08-18T03:50:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising