కనుల పండుగగా అయ్యప్ప జ్యోతి దర్శనం
ABN, First Publish Date - 2022-01-15T04:25:55+05:30
పట్టణంలోని అయ్యప్పనగర్లో వెలసి ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం శుక్రవారం అయ్యప్ప శరణుఘోషతో మారుమోగింది.
పొదలకూరు, జనవరి 14 : పట్టణంలోని అయ్యప్పనగర్లో వెలసి ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం శుక్రవారం అయ్యప్ప శరణుఘోషతో మారుమోగింది. మకర సంక్రాంతి ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం భక్తులకు మకరజ్యోతి దర్శనం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పడిపూజ, అభిషేకం, స్వామికి నైవేద్యం సమర్పించారు. సాయంత్రం మకరజ్యోతి ప్రజ్వలన తన్నీరు సాయిచందు చేయగా భక్తులు భక్తిశ్రద్ధలతో జ్యోతి దర్శనాన్ని తిలకించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలను రమణయ్య, కొండయ్య పర్యవేక్షించారు.
Updated Date - 2022-01-15T04:25:55+05:30 IST