అర్హులందరికీ సంక్షేమ పథకాలు : విక్రమ్రెడ్డి
ABN, First Publish Date - 2022-05-25T02:59:14+05:30
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగుతుందని వైసీపీ నాయకుడు మేకపాటి
ఆత్మకూరు, మే 24 : అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగుతుందని వైసీపీ నాయకుడు మేకపాటి విక్రమ్రెడ్డి పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 12, 13 వార్డుల్లో మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమా న్ని నిర్వహించారు. ఆయన వైసీపీ నేతలతో కలసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు నవరత్న పథకాలను గురించి వివరించారు. ఈ సందర్భంగా ప్రజలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వాటిని నోట్ చేసుకుని పరిష్కరించాలని సచివాలయ సిబ్బందిని, వలంటీర్లను కోరారు. అనంతరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 30 మంది చిరువ్యాపారులకు గొడుగులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం రమేష్బాబు, మున్సిపల్ చైౖర్పర్సన్ జీ వెంకటరమణమ్మ, వైస్చైర్మన్ షేక్ సర్ధార్, వైసీపీ నాయకులు అల్లారెడ్డి ఆనందరెడ్డి, డాక్టర్ సీహెచ్ ఆదిశేషయ్య, సూరా భాస్కర్రెడ్డి, నాగులపాటి ప్రతాప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-05-25T02:59:14+05:30 IST