అక్రమకేసులు బనాయించడం దారుణం
ABN, First Publish Date - 2022-01-23T03:31:08+05:30
కర్నూలు జిల్లాలో బీజేపీ నాయకులపై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడం దారుణమని బీజేపీ పట్టణాధ్యక్షుడు ఆరికట్ల బాలకృష్ణమనాయుడు అన్నారు.
గూడూరు, జనవరి 22: కర్నూలు జిల్లాలో బీజేపీ నాయకులపై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడం దారుణమని బీజేపీ పట్టణాధ్యక్షుడు ఆరికట్ల బాలకృష్ణమనాయుడు అన్నారు. శనివారం స్థానిక విశ్రాంత ఉద్యోగుల భవనంలో వర్చువల్ ప్రజా నిరసనసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఆత్మకూరులో బీజేపీ నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డిపై అల్లరిమూకలు చేసిన దాడిని, వైసీపీ ప్రభుత్వం బీజేపీ నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఖండిస్తున్నామన్నారు. వర్చువల్ ప్రజా నిరసన సభకు మద్దతు తెలిపామ న్నారు. కార్యక్రమంలో పాపారెడ్డి పురుషోత్తమరెడ్డి, పనబాక కోటేశ్వరరావు, బిందురెడ్డి, ఇండ్ల హేమచంద్ర, బైరప్ప, సురేంధ్రనాధ్రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-01-23T03:31:08+05:30 IST