ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైవేపై ఆక్రమణల తొలగింపునకు చర్యలు

ABN, First Publish Date - 2022-05-17T02:29:12+05:30

జాతీయ రహదారి 565 ఆక్రమణలకు గురవుతున్నదని, దీంతో రానున్న రోజుల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, కా

ఆక్రమణలతో రోడ్డుపైనే నిలచిన వర్షపు నీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాపూరు, మే 16: జాతీయ రహదారి 565 ఆక్రమణలకు గురవుతున్నదని, దీంతో రానున్న రోజుల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, కాబట్టి రహదారి హద్దులతో కూడిన మ్యాప్‌ను ఇవ్వాలంటూ 565 హైవే అథారిటీ, తిరుపతి ప్రాజెక్టు మేనేజరు ఇటీవల నెల్లూరు ఆర్డీవోకు వినతిపత్రం అందించారు. ఈ విషయమై జిల్లాకలెక్టర్‌తోపాటు  ఎన్‌హెచ్‌ ఏఐ పీవో, రాపూరు తహసీల్దారుకు సమాచారం అందిం చారు. తిరుపతి జిల్లా ఏర్పేడు నుంచి నల్గొండ జిల్లా నకిరేకల్‌ వరకు రెండు రాష్ట్రాలను, మెట్ట ప్రాంతాలను కలుపుతూ వెంకటగిరి, రాపూరు, సోమశిల, పామూరు, కనిగిరి, మాచర్ల మీదుగా 501 కిలోమీటర్ల పొడవు డబుల్‌ రోడ్డు విత్‌ పేవ్‌మెంటుగా నిర్మించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ రహదారిని కేంద్రమంత్రి గడ్కారీ ప్రారంభించారు.  ఇటీవలే హైవే అథారిటీ అధికారులు ఈ  రహదారిని పరిశీలించారు. పలుచోట్ల రోడ్డు చెంతనే ఆక్రమణలు ఉన్నట్లు, వీటితో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నట్లు  కూడా గుర్తించారు. దీంతో ఆక్రమణలను తొలగిం చాలని నిర్ణయించారు. దీంతో రహదారికి సంబంధించిన మ్యాప్‌ను అందించాలని కోరారు. 


Updated Date - 2022-05-17T02:29:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising