6,7 తేదీల్లో ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు
ABN, First Publish Date - 2022-02-24T03:30:44+05:30
మార్చి 6,7 తేదీల్లో గుంటూరులో ఏఐటీయూసీ రాష్ట్రమహాసభలు నిర్వహించనున్నామని, వీటిని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన
6,7 తేదీల్లో ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు
కావలి, ఫిబ్రవరి23: మార్చి 6,7 తేదీల్లో గుంటూరులో ఏఐటీయూసీ రాష్ట్రమహాసభలు నిర్వహించనున్నామని, వీటిని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దామా అంకయ్య పిలుపునిచ్చారు. కావలి సీపీఐ కార్యాలయంలో బుధవారం మహాసభల గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 6న మధ్యాహ్నం 2 గంటలకు గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుంచి కార్మికుల మహాప్రదర్శన జరుగుతుందన్నారు. సాయంత్రం 4 గంటలకు గురుదాస్ గుప్తా మైదానంలో బహిరంగసభ జరుగుతుందని తెలిపారు. ఈ మహాసభల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై సమరశంఖాన్ని పూరిస్తామ న్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ కావలి నియోజకవర్గ కార్యదర్శి డేగా సత్యం, నాయకులు పసుపులేటి మహేష్, చేవూరి కొండయ్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-02-24T03:30:44+05:30 IST