ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుక్కల దాడిలో మృతి చెందిన గొర్రె పిల్లలు

ABN, First Publish Date - 2022-01-22T03:39:49+05:30

మండలంలోని అప్పసముద్రం పంచాయతీ మసీదుపల్లి గ్రామంలో కుక్కల దాడిలో 40 గొర్రె పిల్లలు మృతి చెందగా మరో 10 పిల్లలు తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది.

కుక్కల దాడిలో మృతి చెందిన గొర్రె పిల్లలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుక్కల దాడిలో 40 గొర్రె పిల్లల మృతి

ఉదయగిరి రూరల్‌, జనవరి 21: మండలంలోని అప్పసముద్రం పంచాయతీ మసీదుపల్లి గ్రామంలో కుక్కల దాడిలో 40 గొర్రె పిల్లలు మృతి చెందగా మరో 10 పిల్లలు తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. బాఽధితుడు పఠాన్‌ ఖాదర్‌ఖాన్‌ కథనం మేరకు.. 3, 4 నెలల వయసు గల పిల్లలను గురువారం ఇంటి పక్కనే ఉన్న దొడ్డిలో తోలి గొర్రెలను గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి మేతకు తోలుకెళ్లారు. తిరిగి సాయంత్రం వచ్చేసరికి దొడ్లో ఉన్న 50 పిల్లలపై కుక్కలు విచక్షణారహితంగా దాడి చేశాయి. ఈ దాడిలో 40 పిల్లలు మృతి చెందగా 10 పిల్లలు తీవ్రంగా గాయపడ్డాయి. జీవాలే జీవనాధారంగా జీవించే తమకు కుక్కల దాడిలో పిల్లలు మృత్యువాతపడడంతో తీవ్రంగా నష్టపోయామని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పశు వైద్యాధికారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని యజమాని వేడుకొంటున్నాడు. 


Updated Date - 2022-01-22T03:39:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising