30న జరిగే ధర్నాను జయప్రదం చేయండి
ABN, First Publish Date - 2022-05-23T03:14:35+05:30
అధిక ధరలను అరికట్టాలని, పన్నుల భారాన్ని తగ్గించాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈనెల 30న కలెక్టరేట్ వద్ద నిర్వహిం
కావలిటౌన్, మే22: అధిక ధరలను అరికట్టాలని, పన్నుల భారాన్ని తగ్గించాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈనెల 30న కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని సీపీఐ నాయకులు కోరారు. ఆదివారం సీపీఐ కార్యాలయంలో వామపక్ష నేతలు గోడపత్రికలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నిత్యావసర వస్తువులు, వంటనూనెల ధరలు అదుపు చేయాలని, బస్సు చార్జీలు, నీటి, ఆస్తి, చెత్తపన్నులు తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి డేగా సత్యం, సీపీఎం పట్టణ కార్యదర్శి పి పెంచలయ్య, సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ నేత కరవది భాస్కర్, ఎల్ లక్షీరెడ్డి, ఏఐటీయూసీ నాయకులు మహేష్, చేవూరి కొండయ్య పాల్గొన్నారు.
Updated Date - 2022-05-23T03:14:35+05:30 IST