29న నెల్లూరులో పద్మశాలి మహాసభ
ABN, First Publish Date - 2022-05-25T04:01:45+05:30
నెల్లూరు నగరంలోని ఇందిరాభవన్లో ఈనెల 29వ తేదీన పద్మశాలి మహాసభ నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్సీ, పద్మశాలి సంఘం నేత బూదాటి రాధయ్య తెలిపారు.
మాజీ ఎమ్మెల్సీ బూదాటి
పొదలకూరు, మే 24 : నెల్లూరు నగరంలోని ఇందిరాభవన్లో ఈనెల 29వ తేదీన పద్మశాలి మహాసభ నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్సీ, పద్మశాలి సంఘం నేత బూదాటి రాధయ్య తెలిపారు. ఈ మేరకు మంగళవారం సంఘం నాయకులు గుత్తికొండ శ్రీనివాసులు, నందం వంశీకృష్ణ, చింతలపూడి సుబ్రహ్మణ్యం, ఊకోటి లక్ష్మీనారాయణ, కోనం బ్రహ్మయ్యలతో కలసి పొదలకూరు పట్టణంలోని ప్రతి కుటుంబాన్ని కలిసి కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ మహాసభకు జిల్లాలోని ప్రతి పద్మశాలి కుటుంబం హాజరై జయప్రదం చేయాలని కోరారు. నూతన జిల్లాలు ఏర్పడిన తరుణంలో జిల్లా కార్యవర్గంలో మార్పులు, చేర్పులు, ఐకమత్యంతో కులబాంధవుల సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చలు ఉంటాయన్నారు. ముఖ్య అతిథులుగా వై.కోటేశ్వరరావు (ప్రముఖ అడ్వకేట్), జె.శ్రీనివాసరావు, కోస్తా ఆంధ్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు బివీ నాగేశ్వరరావు పాల్గొంటారని తెలిపారు.
Updated Date - 2022-05-25T04:01:45+05:30 IST