21 మద్యం సీసాల స్వాధీనం
ABN, First Publish Date - 2022-01-19T05:16:46+05:30
స్థానిక గాంధీనగర్లో మంగళవారం ఎస్ఈబీ సీఐ విజయకుమార్ సిబ్బందితో కలిసి పలు ఇళ్లలో దాడులు నిర్వహించారు.
గూడూరు, జనవరి 18: స్థానిక గాంధీనగర్లో మంగళవారం ఎస్ఈబీ సీఐ విజయకుమార్ సిబ్బందితో కలిసి పలు ఇళ్లలో దాడులు నిర్వహించారు. 21 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్ఈబీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తున్న గాంధీనగర్ ప్రాంతానికి చెందిన రాజేంద్రకుమార్, వెంకటేశ్వర్లు నుంచి 21 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారు ప్రభుత్వ దుకాణాల నుంచి మద్యం కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారన్నారు.
Updated Date - 2022-01-19T05:16:46+05:30 IST