Nellore: పెన్నా బ్యారేజ్ని పరిశీలించిన మంత్రి అనీల్
ABN, First Publish Date - 2022-03-19T16:10:06+05:30
జిల్లాలోని పెన్నాబ్యారేజ్ను మంత్రి అనీల్ కుమార్ యాదవ్ శనివారం ఉదయం పరిశీలించారు.
నెల్లూరు: జిల్లాలోని పెన్నాబ్యారేజ్ను మంత్రి అనీల్ కుమార్ యాదవ్ శనివారం ఉదయం పరిశీలించారు. కాంక్రీట్ వాల్ నిర్మాణపనుల్లో వేగం పెంచాలని అక్కడి అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ మాట్లాడుతూ.... పెన్నా, సంగం బ్యారేజ్ నిర్మాణ పనులు తుది దశకి వచ్చాయని, ఏప్రిల్ నెలాఖరుకి పనులు పూర్తి చేస్తామని తెలిపారు. మే నెలలో మంచి ముహూర్తం చూసి సీఎం చేతుల మీదుగా బ్యారేజ్ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. సంగం బ్యారేజ్కు గౌతం రెడ్డి సంగం బ్యారేజ్గా నామకరణం చేసి జాతికి అంకితం చేస్తామని అన్నారు. రెండు బ్యారేజ్లు ప్రారంభమైతే సాగు, తాగు నీటి సమస్యకి శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రి అనిల్ వెల్లడించారు.
Updated Date - 2022-03-19T16:10:06+05:30 IST