ఏపీ ప్రభుత్వంతో పారదర్శకంగా చర్చలు జరిపాం: బొప్పరాజు
ABN, First Publish Date - 2022-02-10T00:34:21+05:30
ఏపీ ప్రభుత్వంతో పారదర్శకంగా చర్చలు జరిపాం: బొప్పరాజు
అమరావతి: ఏపీ ప్రభుత్వంతో పారదర్శకంగా చర్చలు జరిపామని ఏపీ జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. చర్చల్లోని ప్రతి అంశంలో ఉపాధ్యాయుల భాగస్వామ్యం ఉందని, ఎవరూ వ్యతిరేకించని విషయంపై మీకెందుకు ఒత్తిడి వచ్చింది? అని ఆయన ప్రశ్నించారు. ఉపాధ్యాయులపై ఎవరు ఒత్తిడి తెస్తున్నారో చెప్పాలని బొప్పరాజు డిమాండ్ చేశారు. అప్పుడు ఒప్పుకుని ఇప్పుడు విమర్శలా? అని బొప్పరాజు ప్రశ్నించారు.
Updated Date - 2022-02-10T00:34:21+05:30 IST