AP: ప్రతి సంక్షేమ కార్యక్రమాల్లో కోతలు: Nasir Ahmed
ABN, First Publish Date - 2022-06-24T19:53:03+05:30
వైసీపీ ప్రభుత్వం ప్రతి సంక్షేమ కార్యక్రమాల్లో కోతలు పెట్టిందని టీడీపీ నేత నసీర్ అహ్మద్ విమర్శించారు.
అమరావతి (Amarivathi): వైసీపీ (YCP) ప్రభుత్వం ప్రతి సంక్షేమ కార్యక్రమాల్లో కోతలు పెట్టిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నసీర్ అహ్మద్ (Nasir Ahmed) విమర్శించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ నిత్యవసర వస్తువుల ధరలు పెంచి ప్రజలకు వాతలు పెట్టిందన్నారు. 2020లో మౌలానా అబ్దల్ కలామ్ ఆజాద్ జయంతి రోజున దుల్హన్ పథకానికి దరఖాస్తు చేసుకున్నవారందరికీ డబ్బులు చెల్లిస్తామని జగన్ చెప్పారని, ఇప్పుడు మొండిచేయి చూపారని విమర్శించారు. వైసీపీ తమ ప్రచార ఆర్భాటాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని, మైనార్టీ సోదరీమణులు పెళ్లిళ్లు అయిపోయినా వారికి ఇవ్వాల్సిన రూ.50 వేలు రావడంలేదన్నారు. మైనార్టీల అభివృద్ధిని కాంక్షించి చంద్రబాబు పెట్టిన విదేశీ విద్య పథకాన్ని అటకెక్కించారని, దుల్హన్ పథకాన్ని రూ. లక్షకు పెంచుతామని చెప్పి ముస్లీం మైనార్టీలను మోసం చేశారని, మైనార్టీ శాసనసభ్యులు మైనార్టీ ద్రోహులుగా మిగిలిపోతారని నసీర్ అహ్మద్ అన్నారు.
Updated Date - 2022-06-24T19:53:03+05:30 IST