ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీ రఘురామకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ABN, First Publish Date - 2022-07-03T04:10:54+05:30

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పర్యటన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పర్యటన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భీమవరం పర్యటనలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూడాలని  జిల్లా ఎస్పీని కోర్టు ఆదేశించింది. రఘురామ రాజు భీమవరం పర్యటనలో హెలికాప్టర్  ఉపయోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‎ను  విచారణకు స్వీకరించిన ధర్మాసనం ఎదుట పిటిషనర్ తరఫున న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. ప్రభుత్వానికి హెలికాప్టర్ ల్యాండింగ్ టేకాఫ్‎కు అనుమతి కోరినా స్పందన లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి భీమవరం వెళ్లేందుకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడాలని న్యాయవాది కోరారు. దాంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని చీఫ్ సెక్రటరీని హైకోర్టు ఆదేశించింది.

Updated Date - 2022-07-03T04:10:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising