Nara Lokesh : జగన్ ట్రాప్లో పడి కెరియర్ని నాశనం చేసుకుంటున్నారు
ABN, First Publish Date - 2022-09-24T17:16:00+05:30
తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్ అధికారుల (IAS Officers)ను జైలుకు తీసుకెళ్లాడని..
Amaravathi : తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్ అధికారుల (IAS Officers)ను జైలుకు తీసుకెళ్లాడని.. ఇక తన హయాం వచ్చేసరికి ఐఏఎస్లతో పాటు ఐపీఎస్లు, పలువురు పోలీస్ అధికారులను సైతం జైలు పాలు చేయబోతున్నారని ఏపీ సీఎం జగన్ (AP CM Jagan)ను ఉద్దేశించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) పేర్కొన్నారు. కొంతమంది అధికారులు తాత్కాలిక ప్రయోజనాల కోసం జగన్ రెడ్డి ట్రాప్లో పడి కెరియర్ని నాశనం చేసుకుంటున్నారని నేడు ఆయన ట్విటర్ (Twitter) వేదికగా పేర్కొన్నారు.
‘‘తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్ అధికారులను జైలుకు తీసుకెళ్లాడు. తన హయాంలో ఐఏఎస్లతో పాటు ఐపీఎస్లతో సహా పలువురు పోలీస్ అధికారులను జైలు పాలు చెయ్యబోతున్నాడు జగన్ రెడ్డి. కొంతమంది అధికారులు తాత్కాలిక ప్రయోజనాల కోసం జగన్ రెడ్డి ట్రాప్లో పడి కెరియర్ని నాశనం చేసుకుంటున్నారు. 41ఏ నోటీసులు ఇవ్వకుండా జర్నలిస్ట్ అంకబాబు గారిని ఎందుకు అరెస్ట్ చేశారంటూ సీఐడీ అధికారులపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే కోర్టు మొట్టికాయలు వేస్తున్నా అధికారులు తీరు మారడం లేదు. గీత దాటి ప్రవర్తిస్తున్న వారంతా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవడంతో పాటు ఎందుకు తప్పు చేశాం అని జీవితాంతం బాధపడటం ఖాయం’’ అని లోకేశ్ పేర్కొన్నారు.
Updated Date - 2022-09-24T17:16:00+05:30 IST