AP News: విలీన మండలాలు విషజ్వరాలతో అల్లాడుతున్నాయి: నారా లోకేష్
ABN, First Publish Date - 2022-09-02T00:25:31+05:30
విలీన మండలాలు విషజ్వరాలతో అల్లాడుతున్నాయని టీడీపీ నేత నారా లోకేష్ (Nara Lokesh) తెలిపారు.
అమరావతి: విలీన మండలాలు విషజ్వరాలతో అల్లాడుతున్నాయని టీడీపీ నేత నారా లోకేష్ (Nara Lokesh) తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షల కిట్లు, మందులు లేవని చెప్పారు. చింతూరులో నలుగురు మృతిచెందినా సర్కార్లో చలనం లేదని దుయ్యబట్టారు. సీఎం జగన్ (CM Jagan)కు ఏ మాత్రం మానవత్వం ఉన్నా.. సంధ్య వంటి మరో చిన్నారి బలి కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మామలా రక్షిస్తానన్న జగన్రెడ్డి మాయమాటలు.. చిన్నారి సంధ్య ప్రాణాలు తీసుకువస్తాయా? అని ప్రశ్నించారు. వరద ప్రాంతాల్లో పర్యటించిన సీఎం ఆయా గ్రామాల.. సమస్యలపై దృష్టి సారిస్తే సంధ్య మన మధ్య ఉండేదన్నారు. అమ్మ ఒడి ఇస్తున్నానంటూ.. అమ్మ ఒడిలో బిడ్డల ప్రాణాలు తీయడం న్యాయమేనా? అని నారా లోకేష్ ప్రశ్నించారు.
Updated Date - 2022-09-02T00:25:31+05:30 IST