ఏపీలో అరాచకం సృష్టించడమే వైసీపీ అజెండా: నక్కా ఆనందబాబు
ABN, First Publish Date - 2022-01-03T20:28:37+05:30
ఏపీలో అరాచకమే అజెండాగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు వ్యాఖ్యానించారు.
గుంటూరు: ఏపీలో అరాచకమే అజెండాగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘టీడీపీకి పెరుగుతున్న ప్రజాదరణతో విగ్రహాల ధ్వంసం లాంటి దుశ్చర్యాలకు పాల్పడుతున్నారు. రేపు వైసీపీ అధికారం కోల్పోతే మీ తండ్రి వైఎస్ విగ్రహాల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు డీజీపీ గౌతమ్ సావాంగ్కి కనబడవు, వినపడవు. వైసీపీ కండవా కప్పుకోకుండానే డీజీపీ సీఎం జగన్మోహన్రెడ్డికి జీ హుజూర్ అంటున్నారు. తక్షణమే సీఎం జగన్ విగ్రహాల ధ్వంసంపై ప్రకటన చేయాలి. రాష్ట్రంలో జరిగే దుశ్చర్యాలకు ఆపాలి’’ అని నక్కా ఆనందబాబు పేర్కొన్నారు.
Updated Date - 2022-01-03T20:28:37+05:30 IST