Nakka Anand Babu : ఓట్లు వేసి అందలం ఎక్కించిన దళితులకు మీరిచ్చే గిఫ్ట్ ఇదా?
ABN, First Publish Date - 2022-08-30T17:47:09+05:30
దళిత కానిస్టేబుల్ అనేక సంవత్సరాలుగా రావాల్సిన బకాయిలపై నిరసన తెలిపితే తొలగిస్తారా? అని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు(Nakka Anand Babu) పేర్కొన్నారు.
Amaravathi : దళిత కానిస్టేబుల్ అనేక సంవత్సరాలుగా రావాల్సిన బకాయిలపై నిరసన తెలిపితే తొలగిస్తారా? అని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు(Nakka Anand Babu) పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళితులు ఓట్లు వేసి అందలం ఎక్కించినందుకు ఇదా మీరిచ్చే బహుమానం అని ప్రశ్నించారు(Nakka Anand Babu questioned). దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం(YCP Government) దళితులపై దాడులకు తెగబడుతోందన్నారు. మాస్కులు అడిగినందుకు డాక్టర్ సుధాకర్(Dr.Sudhakar)ని చనిపోయేవరకు హింసించారన్నారు. డాక్టర్ అనితారాయ్ని అనేక ఇబ్బందులు పెట్టారన్నారు. జడ్జి రామకృష్ణపై దేశద్రోహం మోపారన్నారు. దళితులకు ఉన్న పథకాలను రద్దు చేశారన్నారు. దళితులపై చులకనభావం వీడాలన్నారు. దళిత కానిస్టేబుల్కు చట్టబద్ధంగా న్యాయం చేయకపోతే ఆందోళన చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో దళితులు వైసీపీ(YCP) అంతు చూస్తారన్నారు. తెలుగుదేశం పార్టీ(Telugudesam Party) దళితులకు ఎప్పుడూ అండగా ఉంటుందని నక్కా ఆనంద్ బాబు పేర్కొన్నారు.
Updated Date - 2022-08-30T17:47:09+05:30 IST