రైతులకు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం: మనోహర్
ABN, First Publish Date - 2022-06-16T23:16:28+05:30
రైతులకు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని జనసేన నేత మనోహర్ తప్పుబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
గుంటూరు: రైతులకు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని జనసేన నేత మనోహర్ తప్పుబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు భరోసాకు కేంద్ర నిధులు వస్తున్నాయని తెలిపారు. రైతు బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వమే స్కామ్గా మార్చిందని ఆరోపించారు. కౌలు రైతుల సమస్యలను సీఎం జగన్ గుర్తించలేకపోతున్నారని మండిపడ్డారు. ధాన్యం కొని డబ్బులు కూడా ఇవ్వడం లేదన్నారు. ప్రత్యేక హోదా కాకపోతే ప్రత్యేక నిధులు తేవాలని డిమాండ్ చేశారు. అమరావతినే రాజధానని స్పష్టంగా చెప్పాలని కేంద్రాన్ని కోరామని మనోహర్ తెలిపారు. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని కేంద్రానికి చెప్పామన్నారు. అమలాపురం ఘటనపై కేంద్రమంత్రి అమిత్షాకు లేఖ రాశామని చెప్పారు. అసత్యాలు చెప్పినందుకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని మనోహర్ డిమాండ్ చేశారు.
Updated Date - 2022-06-16T23:16:28+05:30 IST