TDP: పల్నాడు జిల్లాలో దారుణం.. టీడీపీ నేతపై గొడ్డళ్లతో దాడి
ABN, First Publish Date - 2022-07-19T13:55:31+05:30
రొంపిచెర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై హత్యాయత్నం జరిగింది.
పల్నాడు: జిల్లాలో వైసీపీ (ycp) మూకలు మరోసారి రెచ్చిపోయాయి. అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తూ ప్రత్యర్థి వర్గాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా పల్నాడులోని తెలుగుదేశం (TDP) రొంపిచెర్ల ( Rompicherla) మండల అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డి(Balakotireddy)పై వైసీపీ నేతలు హత్యాయత్నం చేశారు. ఈ దాడితో పల్నాడు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రొంపిచెర్ల మండలంలోని అలవల గ్రామంలో వెన్నా బాలకోటిరెడ్డి మార్నింగ్ వాక్కు వెళ్లారు. ఈ సమయంలో బాలకోటిరెడ్డిపై ప్రత్యర్థులు ఒక్కసారిగా గొడ్డళ్లతో విచక్షణ రహీతంగా దాడి చేశారు. ఈ దాడిలో బాలకోటిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలయిన బాలకోటిరెడ్డిని నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గతంలో రొంపిచెర్ల ఎంపీపీగా బాలకోటిరెడ్డి పని చేశారు. ఈ దాడిపై తెలుగుదేశం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Updated Date - 2022-07-19T13:55:31+05:30 IST