మున్నేరు వాగు వద్ద ఐదుగురు చిన్నారుల మిస్సింగ్?
ABN, First Publish Date - 2022-01-11T01:52:37+05:30
మున్నేరు వాగు వద్ద ఐదుగురు చిన్నారులు మిస్సింగ్ అయినట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రం 4 గంటల సమయంలో మున్నేరు దగ్గరకు....
విజయవాడ: మున్నేరు వాగు వద్ద ఐదుగురు చిన్నారులు మిస్సింగ్ అయినట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రం 4 గంటల సమయంలో మున్నేరు దగ్గరకు చిన్నారులు వెళ్లారు. చిన్నారులు ఇప్పటివరకూ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మున్నేరులో గల్లంతయ్యారా? లేక అవతలి ఒడ్డుకు వెళ్లారా అనేదానిపై అనుమానం వ్యక్తమవుతోంది. మున్నేరు ఒడ్డునే పిల్లలకు సంబంధించిన సైకిల్, బట్టలను స్థానికులు గుర్తించారు. చందర్లపాడు మండలం ఏటూరు దగ్గర ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు మున్నేరు వాగు వద్దకు వెళ్లారు. చిన్నారుల కోసం ఆరా తీస్తున్నారు.
Updated Date - 2022-01-11T01:52:37+05:30 IST