ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి అంత్యక్రియలు పూర్తి
ABN, First Publish Date - 2022-01-25T08:59:23+05:30
శ్రీకాళహస్తి దేవస్థానం ఆస్థాన జ్యోతిష పండితుడు, శ్రీశైలం వీరశైవ పీఠాధిపతి ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి అంత్యక్రియలు ముగిశాయి.
ప్రముఖుల నివాళి.. కడసారి దర్శనానికి తరలివచ్చిన ప్రజలు
కవాడిగూడ, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తి దేవస్థానం ఆస్థాన జ్యోతిష పండితుడు, శ్రీశైలం వీరశైవ పీఠాధిపతి ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు.. అశ్రునయనాలతో వెంటరాగా.. దోమలగూడలోని కుమార్తె శివజ్యోతి నివాసం నుంచి సోమవారం మధ్యాహ్నం మొదలైన అంతి మయాత్ర.. మలక్పేటలోని రేస్కోర్స్ వద్దగల హిందూ శ్మశాన వాటిక వరకు సాగింది. అంతకుముందు పలువురు ప్రముఖులు ఆయన పార్థివ దేహానికి నివాళి అర్పించారు. అలాగే, రామలింగేశ్వర సిద్ధాంతిని కడసారి దర్శించుకునేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. కాగా, ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి ఆదివారం శివైక్యమైన విషయం తెలిసిందే.
Updated Date - 2022-01-25T08:59:23+05:30 IST