సీఐడీ అధికారులకు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ
ABN, First Publish Date - 2022-01-17T21:58:25+05:30
సీఐడీ అధికారులకు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. నేడు సీఐడీ దర్యాప్తు అధికారి ముందు రఘురామ హాజరుకావాల్సి వుంది.
అమరావతి: సీఐడీ అధికారులకు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. నేడు సీఐడీ దర్యాప్తు అధికారి ముందు రఘురామ హాజరుకావాల్సి వుంది. అత్యవసర పనిపై ఢిల్లీకి వచ్చానని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. అనారోగ్య కారణాలతో డాక్టర్ను సంప్రదించానని తెలిపారు. సీఐడీ నోటీసులపై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ రఘురామ వేశారు. 4 వారాల సమయం ఇవ్వాలని ఎంపీ కోరారు. సీఐడీ ఏడీజీకి ఆయన కాపీ పంపారు. ఈ నెల 11న ఎంపీ రఘురామకు సీఐడీ నోటీసులిచ్చింది.
Updated Date - 2022-01-17T21:58:25+05:30 IST