Modi birthday celebrations: విజయవాడలో ఘనంగా మోదీ జన్మదిన వేడుకలు
ABN, First Publish Date - 2022-09-17T17:44:48+05:30
నగరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
విజయవాడ: నగరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra modi) జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ యువ మోర్చా(BJP Yuva Morcha) ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. యువ మోర్చా కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ (Kanna laxmi narayana) మాట్లాడుతూ... మోదీ (Prime minister) 72వ జన్మదినోత్సవం సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశమంతా నేడు మోదీ పుట్టిన రోజు వేడుకలు జరుపుతున్నారన్నారు. రక్తదాన శిబిరాలు, వస్త్రాలు, పండ్లు పంపిణీ, వంటి సేవా కార్యక్రమాలు చేశారని అన్నారు. బీజేపీ పక్షాన ఆర్భాటాలు లేకుండా అన్నదానం, మొక్కల నాటడం వంటి కార్యక్రమాలతో ఆదర్శంగా నిలిచిందని కన్నా(BJP Leader) తెలిపారు.
ప్రతి యేడాది సామాజిక కార్యక్రమాలలో బీజేపీ శ్రేణులను భాగస్వామ్యం చేశారన్నారు. యుగానికి ఒక యుగ పురుషుడు పుడతారంటారు.. అతనే నరేంద్ర మోదీ (PM Modi) అంటూ చెప్పుకొచ్చారు. మోదీ నాయకత్వంలో దేశం ఎంతో పురోగతి చెందుతుందన్నారు. ఆర్ధిక వ్యవస్థ కుదేలైనా తిరిగి గాడిలో పెట్టిన ఘనత మోదీకే దక్కుతుందని అన్నారు. ప్రజల కోసం, దేశం కోసం ఆలోచన చేసే మోదీ నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కన్నా లక్ష్మీనారాయణ ఆకాంక్షించారు.
Updated Date - 2022-09-17T17:44:48+05:30 IST