ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

chandrababu మాల, మాదిగల మధ్య చిచ్చు పెట్టారు: మంత్రి సురేష్

ABN, First Publish Date - 2022-05-29T02:19:47+05:30

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాల, మాదిగల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా వాడుకున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్నాడు జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాల, మాదిగల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా వాడుకున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. శనివారం నరసరావుపేటలో సామాజిక బేరి సభ నిర్వహించారు. ఈసభకు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యే, నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు మీ అందరికీ తెలిసినవేనని చెప్పారు.ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజకీయంగా పదవులు వస్తేనే అసమానతలు తొలిగి పోతాయని ఆలోచించిన నేతలు లేరని, అందరికీ పదవులు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌రెడ్డిదేనని అన్నారు.చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఓటు బ్యాంకుగా చూశారన్నారు. ఆయన మంత్రి వర్గంలో గిరిజనులకు, మైనార్టీలకు అవకాశమే లేదని చెప్పారు.మాల, మాదిగలకు జగన్ ఐదు మంత్రి పదవులిచ్చారన్నారు.సురేష్‌కు మంత్రి పదవి రాదు. సీఎం సొంత కులానికే మంత్రి పదవి ఇస్తారని కొంతమంది ప్రచారం చేశారని, కానీ సీఎం తనకు రెండోసారి కూడా అవకాశం కల్పించారని మంత్రి సురేష్ చెప్పారు.


Updated Date - 2022-05-29T02:19:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising