ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిగుసుకుపోయిన భీమ్లానాయక్‌: రోజా

ABN, First Publish Date - 2022-07-05T08:26:25+05:30

బిగుసుకుపోయిన భీమ్లానాయక్‌: రోజా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దివాన్‌చెరువు (రాజమహేంద్రవరం), జూలై 4: ‘‘భీమవరం సమావేశం చూసి భీమ్లానాయక్‌ బిగుసుకుపోయాడు. మళ్లీ అధికారంలోకి రావాలని చంద్రబాబు తహతహలాడడం అత్యాశే అవుతుంది’’ అని మంత్రి రోజా అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ వైసీపీ ప్లీనరీ సమావేశం దివాన్‌చెరువులో వైసీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా మంత్రి పాల్గొన్నారు. ‘‘మంత్రిగా ఉండి ఓడిపోయిన లోకేశ్‌... జగన్‌కు సమానం అనుకుంటున్నాడు. వాళ్ల నాన్న కేసీఆర్‌ని చూసి విజయవాడకు వచ్చాడు. జగన్‌ను చూసి హైదరాబాద్‌ పారిపోయాడు. బాబు అధికారంలోకి వస్తే రాష్ట్రం నాశనం అవుతుంది. అటువంటి దారులు మూసేయండి. టీడీపీ నేత బండారు సత్యనారాయణ తాము అధికారంలోకి వస్తే జగన్‌ సంక్షేమ పథకాలు మూసేస్తామంటే, మరో నాయకుడు అచ్చెన్నాయుడు వలంటరీ వ్యవస్థను తీసిపారేస్తాం అంటున్నారు’’ అంటూ ఆరోపించారు. సమావేశంలో హోం మంత్రి తానేటి వనిత, ఎంపీ మార్గాని భరత్‌, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, కురసాల కన్నబాబు, సత్తి సూర్యనారాయణరెడ్డి, చిర్ల జగ్గిరెడ్డి. జ్యోతుల చంటిబాబు, తలారి వెంకట్రావు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-05T08:26:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising