JAGAN వైకుంఠ పాళి ఎక్కిస్తే... CHANDRABABU పాతాళానికి తొక్కేశారు: మంత్రి రజినీ
ABN, First Publish Date - 2022-05-29T02:47:16+05:30
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను జగన్ వైకుంఠ పాళి ఎక్కిస్తే... టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాతాళానికి తొక్కేశారని మంత్రి విడదల రజినీ అన్నారు.
పల్నాడు జిల్లా: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను జగన్ వైకుంఠ పాళి ఎక్కిస్తే... టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాతాళానికి తొక్కేశారని మంత్రి విడదల రజినీ అన్నారు. శనివారం నరసరావుపేటలో సామాజిక బేరి సభ నిర్వహించారు. ఈ సభకు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యే, నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి రజినీ మాట్లాడుతూ.. రాజ్యసభ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చంద్రబాబు ఇవ్వలేదన్నారు.సీఎం జగన్ ఎనిమిది రాజ్యసభ సీట్లలో నలుగురు బీసీలకు ఇచ్చారన్నారు.రాష్ట్రంలో సంక్షేమ, సామాజిక విప్లవం నడుస్తోందని చెప్పారు.చిలకలూరిపేట చరిత్రలో ఒక బీసీకి టికెట్ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు.తనకు టికెట్ ఇవ్వడమే కాకుండా గెలిపించి మంత్రి పదవి ఇచ్చిన దమ్మున్న నాయకుడు జగన్ అని మంత్రి రజినీ తెలిపారు.
Updated Date - 2022-05-29T02:47:16+05:30 IST