ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ వాళ్ళు శాసనసభ్యులా?... ఇంత గాలిగా వ్యవహరిస్తారా?: పేర్నినాని

ABN, First Publish Date - 2022-03-22T19:01:31+05:30

టీడీపీ సభ్యులపై మంత్రి పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ సభా సమయాన్ని వృధా చేస్తుందన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ సభ్యులపై మంత్రి పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ సభా సమయాన్ని వృధా చేస్తుందన్నారు. స్పీకర్‌పైన ఆకతాయితనంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ వాళ్ళు శాసనసభ్యులా? ఇక్కడికి వచ్చి ఏమి చేద్దాం అనుకుంటున్నారని ప్రశ్నించారు. ఇంత గాలిగా వ్యవహరిస్తారా? అంటూ దుయ్యబట్టారు. గాలితనం చేయడం... మళ్ళీ బొంకడం టీడీపీ నేతలకే చెల్లుతుందని అన్నారు. కొత్తపల్లి సుబ్బారాయుడు వైసీపీని గెలిపించి తప్పు చేశామని మాట్లాడితే దానిని ఖండిస్తున్నామన్నారు. భీమవరాన్ని జిల్లా కేంద్రం చేయడం ఇష్టం లేకపోతే సీఎం జగన్‌కు తన అభిప్రాయాలు చెప్పవచ్చని అన్నారు. నర్సాపురం ఎమ్మెల్యేను రాజకీయంగా బదనామ్ చేద్దామని బురద జల్లడం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుబ్బారాయుడు చెప్పుతో కోట్టుకోవాలి అంటే చాలా సార్లు కొట్టుకోవాలని మంత్రి పేర్నినాని వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2022-03-22T19:01:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising