ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం క్యాంప్ ఆఫీస్‌కు చేరుకున్న మంత్రి కాకాణి

ABN, First Publish Date - 2022-04-20T22:15:06+05:30

నెల్లూరు వైసీపీ పంచాయతీ సీఎం జగన్ వద్దకు చేరింది. సీఎం క్యాంప్ ఆఫీస్‌కు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చేరుకున్నారు. ఇప్పటికే సీఎం దగ్గరకు మాజీ మంత్రి అనిల్ యాదవ్ వచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: నెల్లూరు వైసీపీ పంచాయతీ సీఎం జగన్ వద్దకు చేరింది. సీఎం క్యాంప్ ఆఫీస్‌కు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చేరుకున్నారు. ఇప్పటికే సీఎం దగ్గరకు మాజీ మంత్రి అనిల్ యాదవ్ వచ్చారు. నేడు సీఎం సమక్షంలో నెల్లూరు వైసీపీ నేతల పంచాయితీకి ముగింపు పలకనున్నారు. అంతకుముందు మంత్రి కాకాణి, ఆనం వేంరెడ్డి వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అనిల్‌కు ముఖ్యమంత్రి నుంచి పిలుపు వచ్చింది. దీంతో బుధవారం సాయంత్రం 3గంటలకు సీఎం జగన్‌ను అనిల్‌ కుమార్‌ యాదవ్ కలిశారు. పరస్పరం ఆరోపణలు చేసుకున్న అనిల్‌, కాకాణిలపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి కాకాణిపై చేసిన విమర్శలు, ఫ్లెక్సీల చించివేతపై సీఎంకు అనిల్‌ వివరణ ఇచ్చారు. మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణ తర్వాత నెల్లూరు వైసీపీలో విబేధాలు రోడ్డున పడ్డాయి. కాకాణి, ఆనం, వేంరెడ్డి వర్గాలకు అనిల్ వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

Updated Date - 2022-04-20T22:15:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising