జంగారెడ్డిగూడెం మరణాలపై మంత్రి ఆళ్లనాని సమీక్ష
ABN, First Publish Date - 2022-03-13T00:16:36+05:30
జిల్లాలో మిస్టరీగా మారిన జంగారెడ్డిగూడెంలో మరణాలపై మంత్రి
పశ్చిమ గోదావరి: జిల్లాలో మిస్టరీగా మారిన జంగారెడ్డిగూడెం మరణాలపై మంత్రి ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంగారెడ్డిగూడెంలో సారాతో మరణించింది ఐదుగురు మాత్రమేనన్నారు. మిగతా వారు వేర్వేరు వ్యాధులతో మృతి చెందారని ఆయన తెలిపారు. మరణాలపై టీడీపీ ఆరోపణలన్నీ అవాస్తవమన్నారు. మృతి చెందినవారి ఇళ్ల పరిసరాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. నాటుసారా స్థావరాలపై నిరంతరం దాడులు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ మరణం జరిగినా ప్రభుత్వ హత్యే అనడం సరి కాదన్నారు. టీడీపీ శవ రాజకీయాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.
Updated Date - 2022-03-13T00:16:36+05:30 IST