మంత్రి Adimulapu Sureshకు స్వల్ప అస్వస్థత
ABN, First Publish Date - 2022-06-25T17:14:16+05:30
మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.
ప్రకాశం: మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్(Adimulapu Suresh) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మార్కాపురంలోని జార్జి ఇంజనీరింగ్ కాలేజీలో ఈరోజు ఉదయం వాకింగ్ చేస్తండగా మంత్రి అస్వస్థతకు లోనయ్యారు. లో బిపి, ఆయాసంతో ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం ఆయనకు జార్జి ఇంజనీరింగ్ కాలేజీలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ యశోద హాస్పిటల్లో మంత్రి సురేష్కు వైద్యులు యాంజియోగ్రామ్ చేసిన విషయం తెలిసిందే.
Updated Date - 2022-06-25T17:14:16+05:30 IST