విదేశీ అతిథులొచ్చాయోచ్..!
ABN, First Publish Date - 2022-10-11T09:41:43+05:30
వలస పక్షుల సంతానోత్పత్తి కేంద్రంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నేలపట్టు పక్షుల కేంద్రానికి విదేశీ పక్షులు విచ్చేశాయి. తిరుపతి జిల్లా
దొరవారిసత్రం, అక్టోబరు 10: వలస పక్షుల సంతానోత్పత్తి కేంద్రంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నేలపట్టు పక్షుల కేంద్రానికి విదేశీ పక్షులు విచ్చేశాయి. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలోని నేలపట్టు పక్షుల కేంద్రానికి యేటా అక్టోబరులో వచ్చే విహంగాలు వారం రోజులనుంచి వస్తున్నాయి. పది రోజులుగా ఈ ప్రాంతంలో వర్షాలు కురవడంతో పక్షుల కేంద్రంలోని మంచినీటి చెరువులు జలకళ సంతరించుకున్నాయి. ఆ చెరువుల్లోని పచ్చని కడప చెట్లపై తెల్లని పూలవలే విడిది చేసేందుకు విదేశీ పక్షులు విచ్చేశాయి.అనువైన చెట్టు కొమ్మలను వెతుక్కుంటున్నాయి. నైజీరియా ప్రాంతం నుంచి మొదటగా వచ్చే ఒపన్ బిల్డ్ స్టార్క్స్(నత్తగుల్లగొంగలు) 356 విచ్చేశాయి. వైట్ఐబీ్స(తెల్లకంకణాయి) రకం పక్షులు 74, కార్మోరెంట్స్(నీటికాకులు) 37 వరకు వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. ప్రత్యేకత కలిగిన పెలికాన్(గూడబాతు) పక్షులు మాత్రం ఇప్పటి వరకూ రాలేదు. రెండు రోజుల క్రితం వీటి పైలట్ పక్షులు చక్కర్లు కొట్టి వెళ్ళినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ రకం పక్షులు కూడా ఈ వారంలో విచ్చేసే అవకాశాలు ఉన్నవి.
Updated Date - 2022-10-11T09:41:43+05:30 IST