AP News: కొళాయిలకు మీటర్లు.. విజయవాడలో మొదలు
ABN, First Publish Date - 2022-12-09T18:38:29+05:30
Vijayawada: ప్రజలపై మరో బాదుడుకు రంగం సిద్ధం చేసింది జగన్ (CM Jagan) ప్రభుత్వం. ఇప్పటికే చెత్త పన్నుతో జనాన్ని పిండేస్తున్న వైసీపీ సర్కారు.. జగన్ ఆదేశాలతో కొళాయిలకు మీటర్లు బిగించేందుకు అధికార యంత్రాగం
Vijayawada: ప్రజలపై మరో బాదుడుకు రంగం సిద్ధం చేసింది జగన్ (CM Jagan) ప్రభుత్వం. ఇప్పటికే చెత్త పన్నుతో జనాన్ని పిండేస్తున్న వైసీపీ సర్కారు.. జగన్ ఆదేశాలతో కొళాయిలకు మీటర్లు బిగించేందుకు అధికార యంత్రాగం సమాయత్తమవుతోంది. విజయవాడలో ఇంటి కొళాయిలకు మీటర్లను బిగించడం మొదలుపెట్టారు. మధురానగర్ పసుపు తోటలో ఇంటి యజమానులకు చెప్పకుండానే ఏకపక్షంగా బిగిస్తున్నారు. దశలవారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ మీటర్లను బిగించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే నీటి మీటర్లను బలవంతంగా బిగించడం అన్యాయమని, బిగింపు ప్రక్రియను వెంటనే నిలిపేయాలని సీపీఎం (CPM) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్.బాబురావు డిమాండ్ చేశారు.
Updated Date - 2022-12-09T18:38:30+05:30 IST