ఏపీ గవర్నర్కు నారా లోకేష్ లేఖ
ABN, First Publish Date - 2022-03-06T19:24:43+05:30
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు లేఖ రాశారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు లేఖ రాశారు. ఆంధ్ర యూనివర్సిటీ వీసీని రీకాల్ చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. వైసీపీ పాలనలో వర్సిటీలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయన్నారు. వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం, నిబంధనలను ఉల్లంఘిస్తూ.. వీసీ పివిజిడి ప్రసాద్రెడ్డి వర్సిటీ ప్రతిష్టను దిగజారుస్తున్నారని ఆరోపించారు. వర్సిటీని ప్రసాద్రెడ్డి అక్రమాలకు అడ్డాగా మార్చుకున్నారని, వీసీని వెంటనే రీకాల్ చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని లోకేష్ ఆ లేఖలో పేర్కొన్నారు.
Updated Date - 2022-03-06T19:24:43+05:30 IST