Nara Lokesh: జగన్ రెడ్డికి కుప్పంలో భంగపాటు తప్పదు...
ABN, First Publish Date - 2022-08-25T17:20:24+05:30
జగన్ రెడ్డి (Jagan reddy) కుప్పంలో ఎన్ని కుప్పి గంతులు వేసినా చివరికి భంగపాటు తప్పదని
అమరావతి (Amaravathi): జగన్ రెడ్డి (Jagan reddy) కుప్పంలో ఎన్ని కుప్పి గంతులు వేసినా చివరికి భంగపాటు తప్పదని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. గురవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పేదవాళ్ల నోటిలో ముద్ద లాక్కునే మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్ రెడ్డని మండిపడ్డారు. సీఎం (CM) పేదవాళ్లకు అన్నం పెట్టరని.. ఇతరులను పెట్టనివ్వరని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లపై (Anna canteens) వైసీపీ (YCP) మూకలు దాడులు చేస్తూనే ఉన్నాయని, ఈ రోజు కుప్పంలో చంద్రబాబు (Chandrababu) ప్రారంభించబోయే అన్న క్యాంటిన్ను వైసీపీ గూండాలు ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. జగన్ రౌడీయీజం పులివెందులలో చూపించుకోవాలని, కుప్పంలో కాదన్నారు. కుప్పం జోలికి వస్తే వైసీపీ అల్లరిమూకల తాటతీస్తామని నారా లోకేష్ హెచ్చరించారు.
Updated Date - 2022-08-25T17:20:24+05:30 IST