అడుగడుగునా దగా చేస్తున్నారు: lanka dinakar
ABN, First Publish Date - 2022-05-19T21:38:48+05:30
అడుగడుగునా దగా చేస్తున్నారు: lanka dinakar
అమరావతి: అన్ని రకాల ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే అన్న సీఎం జగన్ రాజ్యసభ స్థానాలు మాత్రం స్థానికేతరులతో నింపారని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. తన తండ్రి మరణానికి కారణమని ఆరోపించినవారి మాటపైనే జగన్ రాజ్యసభ సీటు ఇచ్చారని చెప్పారు. స్థానికేతరులను రాజ్యసభకు పంపి ఏపీ ప్రయోజనాలను తాకట్టుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఆంధ్రపై ద్వేషం విరజిమ్మేవారిని సలహాదారుగా నియమించారని, ఇప్పుడు నేరుగా చట్టసభలకు పంపిస్తున్నారని వ్యాఖ్యానించారు. మాట తప్పను.. మడమ తిప్పను అంటూనే అడుగడుగునా దగా చేస్తున్నారని మండిపడ్డారు.
Updated Date - 2022-05-19T21:38:48+05:30 IST