దిగుబడి లేక పత్తి పంట గొర్రెలపాలు
ABN, First Publish Date - 2022-12-07T01:19:27+05:30
కోసిగిలోని ఈరన్న అనే రైతుకు చెందిన సుమారు రెండెకరాల పత్తి పంట దిగుబడి రాకపోవడంతో ఆ రైతు గొర్రెలకు వదిలేశాడు.
కోసిగి, డిసెంబరు 6: కోసిగిలోని ఈరన్న అనే రైతుకు చెందిన సుమారు రెండెకరాల పత్తి పంట దిగుబడి రాకపోవడంతో ఆ రైతు గొర్రెలకు వదిలేశాడు. సుమారు రూ.లక్ష మేర పెట్టుబడి పెట్టినా రెండు క్వింటాళ్లు దిగుబడి కూడా రాలేదని, ఈ ఏడాది తీవ్రంగా నష్టపోయామని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. కళ్ల ముందు పంట ఎత్తుగా పెరిగినా చెట్టుకు పత్తి కాయలు లేకపోవడంతో నష్టపోయానని తెలిపాడు. రూ.లక్ష మేర నష్టం వచ్చిందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.
Updated Date - 2022-12-07T01:19:31+05:30 IST