ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యే మాట్లాడుతుండగానే వెళ్లిపోయారు..

ABN, First Publish Date - 2022-09-28T05:47:47+05:30

నంద్యాల జిల్లా మహానందిలో ఓ కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతుండగానే మహిళలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఎమ్మెల్యే ప్రసంగిస్తుండగానే బయటికి వెళ్లిపోతున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహానంది, సెప్టెంబరు 27: నంద్యాల జిల్లా మహానందిలో ఓ కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతుండగానే మహిళలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మూడో విడత చేయూత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం మహానందిలో మండల వెలుగు అధికారులు నిర్వహించారు. క్షేత్రం పరిసరాల్లోని పోచా విశ్రాంతి భవనంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే షెడ్యూల్‌ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాల్సి ఉండగా సాయంత్రం 4 గంటల తర్వాత వచ్చారు. అయితే అప్పటి దాకా మహిళలు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులు, నాయకులు మాట్లాడిన తర్వాత చివరగా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ప్రసంగిస్తుంగానే ఉన్నట్టుండి ఉక్కసారిగా మహిళలు బయటకు వెళ్లిపోయారు. ఓపికతో వినాలని, ఇది మీ కొరకు ఏర్పాటు చేసిన కార్యక్రమం అని ఎమ్మెల్యే కోరినా మహిళలు వినకుండా బయటకు వెళ్లిపోయారు. అధికారులు కూడా విజ్ఞప్తి చేసినా వెళ్లిపోయారు. చివరికి సభలో ఉన్న కొంతమంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కులను ఇప్పించి అధికారులు కార్యక్రమాన్ని ముగించారు.

Updated Date - 2022-09-28T05:47:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising