ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ధర్నాను జయప్రదం చేయండి’

ABN, First Publish Date - 2022-05-24T06:30:27+05:30

అధిక ధరలను నిరసిస్తూ వామపక్షపార్టీల ఆధ్వర్యంలో ఈనెల 30న కలెక్టరేట్‌ ఎదుట జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(న్యూసిటీ), మే 23: అధిక ధరలను నిరసిస్తూ వామపక్షపార్టీల ఆధ్వర్యంలో ఈనెల 30న కలెక్టరేట్‌ ఎదుట జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య పిలుపునిచ్చారు. సోమవారం వామపక్ష నాయకులతో కలిసి సీపీఐ కార్యాలయంలో ధర్నా పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా గిడ్డయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యా్‌స, వంట నూనె ధరలను తగ్గించాలని, విద్యుత్‌, బస్‌ చార్జీలు, ఆస్తి, నీటి పన్ను భారాలను అదుపు చేయాలని డిమాండ్‌ చేశారు. పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా ఈనెఅల 25, 26 తేదీల్లో పెట్రోలు బంకుల వద్ద కరపత్రాల పంపిణీ, 28న ప్రధాన కూడళ్లలో ప్రచారం, 30న కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. సీపీఎం జిల్లా నాయకులు నారాయణ, సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు నరసింహులు, ఏఐకేఎంఎస్‌ నాయకులు వెంకటస్వామి పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T06:30:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising