10 గేట్ల ద్వారా నీరు విడుదల
ABN, First Publish Date - 2022-09-11T06:01:51+05:30
శ్రీశైల జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం భారీగా కొనసాగుతోంది.
శ్రీశైలం, సెప్టెంబరు 10: శ్రీశైల జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం భారీగా కొనసాగుతోంది. దీంతో శనివారం అధికారులు డ్యాం 10 క్రట్టు గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,75,680 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి 1,66,985, సుంకేసుల నుంచి 80,560 మొత్తం 2,47,545 క్యూసెక్కుల వరద నీరు జలాశయానికి వస్తోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.20 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం 210.9946 టీఎంసీలుగా నమోదయింది. డ్యాం పది క్రస్టు గేట్ల ద్వారా 3,75,680 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తూ, విద్యుత్ ఉత్పత్తి కోసం ఏపీ విద్యుత్ కేంద్రం ద్వారా 30,327, తెలంగాణ విద్యుత్ కేంద్రం ద్వారా 31,784 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు.
Updated Date - 2022-09-11T06:01:51+05:30 IST