వార్డు మెంబరు ఆత్మహత్య
ABN, First Publish Date - 2022-03-16T05:55:09+05:30
మండలంలోని హరివరం గ్రామానికి చెందిన ఏడో వార్డు మెంబరు తోగట సుబ్బరామయ్య (55) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.
ఉయ్యాలవాడ, మార్చి 15: మండలంలోని హరివరం గ్రామానికి చెందిన ఏడో వార్డు మెంబరు తోగట సుబ్బరామయ్య (55) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. ఉదయం 10 గం టలకు పురుగుల మందు తాగిన సుబ్బరామయ్యను బంధువులు గుర్తించి కోవెలకుంట్లలోని ఓ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతికిగల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
Updated Date - 2022-03-16T05:55:09+05:30 IST